Rc.No.16021, Dt.18.03.2020; Teachers measure student footprint for distribution of shoes as part of distribution of kits to students.
ఆర్ .
సి . నెం . ఎస్ . ఎస్ 16021 / 4 /
2019
ఎం . ఐ . ఎస్ , ఎస్ . ఇ . సి . -
ఎస్ఎస్ఏ తేది : 18 . 03 . 2020
విషయం : సమగ్ర శిక్షా - జగనన్న విద్యా కానుక -
విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను
సేకరించి నమోదు చేయుట గురించి , ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వం 2020 - 21 విద్యా
సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు
చదువుతోన్న అందరు విద్యార్ధులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ' జగనన్న విద్యా కానుక '
పేరుతో
స్టూడెంట్ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే .
2
. ఇందులో
భాగంగా ఒక్కో స్టూడెంట్ కిట్లో మూడు జతల యూనిఫాంలు , ఒక సెట్ నోటు పుస్తకాలు , పాఠ్య పుస్తకాలు , ఒక జత బూట్లు ,
రెండు
జతల సాక్సులు , బెల్ట్ , బ్యాగు ఉంటాయి .
3
. ప్రతి
విద్యార్థికి బూట్లు పంపిణీ చేసే ప్రక్రియలో భాగంగా గత సంవత్సరంలో జరిగిన బూట్ల
సరఫరాలో ఎదురైన ముఖ్య సమస్య ' బూట్ల సైజు సరిగా
ఉండకపోవడం ' , తద్వారా కొందరు విద్యార్థులు
అసౌకర్యానికి గురయ్యారు .
4
. ఈ
సమస్యను అధిగమించేందుకు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టరు వారు తీసుకున్న
నిర్ణయం ప్రకారం కింది సూచనలు పొందుపరచడమైనది .
బూట్ల సరఫరా కోసం విద్యార్థుల పాద కొలతలు
నమోదులో పాటించాల్సిన సూచనలు
• విద్యార్థుల పాదాల కొలతలను ఆన్లైన్ ద్వారా నమోదు చేయుట
. ఈ బాధ్యతను సీఆర్పీలకు అప్పగించడమైనది .
•
ఒకటో
తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న అమ్మాయిల , అబ్బాయిల పాదాల కొలతలను తీసుకోవాలి .
•
ప్రస్తుతం
పదో తరగతి చదువుతున్న విద్యార్థుల వివరాలు అవసరం లేదు
. విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేటప్పుడు
ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశము .
. తర్వాతి సంవత్సరానికి అనుగుణంగా ( వారి
పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ) పాదాల కొలత సైజును పెంచి తీసుకోవాలి .
( : : ఉదాహరణకు ఒక విద్యార్థి పాదం ప్రస్తుత
సైజు 5 ఉంటే కాస్త పెంచి 6 సైజుగా నమోదు చేయాలి )
ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో తరగతి ఉపాధ్యాయులు
పర్యవేక్షించాలి . ప్రధానోపాధ్యాయులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి
. ఇందుకోసం
ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్లో హెడ్మాష్టరు లాగిన్ ద్వారా కొలతలు నమోదు చేయాలి
. ప్రధానోపాధ్యాయులు / సీఆర్పీలు ఈ కార్యక్రమాన్ని కచ్చితంగా జరిగేలా బాధ్యత
వహించాలి . హెచ్ఎం లాగిన్లలో పొందుపరిచినటువంటి స్క్రీన్లో 26 . 03 . 2020 లోగా నమోదు చేయాలి .
అందరు జిల్లా విద్యాశాఖాధికారులు ( డీఈవోలు ) , సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు ( ఏపీసీ )
లు పై ఆదేశాలను వెంటనే అమలు పరచవలెను . రాష్ట్రంలో అందరూ జిల్లా
విద్యాశాఖాధికారులు , సమగ్ర శిక్షా
అడిషనల్ ప్రాజెక్టు కో - ఆర్డినేటర్లు పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత
జాగరూకతతో అమలుచేయవలసిందిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది