ఈరోజు EHS స్టీరింగ్ కమిటీ సమావేశానికి APTF జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి ,జిల్లా సోషల్ మీడియా గ్రూపు సభ్యులు రామమోహన్ రెడ్డి హాజరు కావడం జరిగింది EHS పథకం లో ఎదురవుతున్న సమస్యలు ను EHS జిల్లా కోఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.
- ఎమర్జెన్సీ సమయంలో ఎదురయ్యే సమస్యలను APTF తరపున ప్రస్తావించగా, ఏ హాస్పిటల్ లో కూడా ఎమర్జెన్సీ సమయంలో కూడా డబ్బులు కట్టనవసరం లేదు . TID (Telephonic Intimation Department) ద్వారా అప్రూవల్ తీసుకోవచ్చు అని తెలిపారు
- EHS లో కవర్ అయ్యే వ్యాధులు కు సంబంధించి మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు ఇవ్వడం లేదు, GO 17 ద్వారా జులై31 వరకు పొడిగించడం వలన ఉపయోగం లేకుండా పోయింది అని APTF తరపున ప్రాతినిధ్యం చేయగా సమావేశం అనంతరం రాష్ట్ర అధికారులు తో మాట్లాడి మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు పెట్టుకోమని APTF అధ్యక్షుడు కు ఫోన్ ద్వారా తెలిపారు. భవిష్యత్తు లో EHS లో కవరయ్యే వ్యాధులు కు రీయింబర్స్మెంట్ ఉండకపోవచ్చు.
- అందరికీ త్వరలోనే డిపార్ట్మెంట్ HOD ల ద్వారా డిజిటల్ హెల్త్ కార్డులు అందించబడును.
- ప్రస్తుతం వుండే 1889 వ్యాధులు కు అదనంగా ఇంకా కొన్ని వ్యాధులు EHS క్రింద చేర్చబడును.
- కొన్ని హాస్పిటల్స్ నందు సాయంత్రం సమయంలో ఆరోగ్య మిత్ర లు అందుబాటులో వుండడంలేదని APTF తరపున తెలపడం జరిగింది. అందుకు త్వరలోనే ఏర్పాటు చేస్తాము. అటువంటి సమయంలో మాకు తెలిపితే హాస్పిటల్ వారికి చెప్పి అడ్మిషన్లు ఇప్పిస్తామని తెలిపారు.
- 25 సంవత్సరాలు దాటిన పిల్లలు కు ఆరోగ్య రక్ష పథకం ద్వారా (సంవత్సరానికి 1200/- కట్టాలి) అన్ని రకాల వైద్యసేవలు పొందవచ్చు .
- 45 సంవత్సరాలు వయస్సు దాటిన వారికి సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేయాలని APTF తరపున కోరగా ప్రస్తుతానికి 15 వ తేదీ నుండి ప్రభుత్వ హాస్పిటల్ నందు EHS OP ప్రారంభిస్తున్నామని 50/-ఫీజు ద్వారా అన్ని రకాల టెస్టులు, మెడిసిన్ ఉచితమని తెలిపారు.
- ప్రతి ఒక్కరూ ఒకసారికి 2 లక్షల వరకు ఎన్నిసార్లైనా వైద్యం చేయించుకోవచ్చని తెలిపారు
- Toll free no. 18004251818