2021 మార్చి నుంచి జనాభా లెక్కలు
🔹దేశ వ్యాప్తంగా 2021లో జనాభా లెక్కలను సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
🔸దీని ప్రకారం 2021 మార్చి 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలను సేకరిస్తారు. మంచుకొండలుండే ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్లో మాత్రం 2020 అక్టోబర్ 1 నుంచి జనాభా లెక్కలు సేకరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.