ప్రభుత్వం DA ల విడుదలపై అధికారిక ప్రకటన చేసింది. 2018 జూలై నుంచి 2019 డిసెంబర్ వరకు మూడు DA లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ ఉన్నాయి. 2020 జనవరి నుంచి రావాల్సిన DAను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. కావున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం మూడు DAలు పెండింగ్ ఉన్నాయి.
3 పెండింగ్ DAలలో ఒక DAను జనవరి 2021 నుంచి రెండో DAను జూలై, 2021 నుంచి మూడో DAను జనవరి 2022 నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
అలాగే కరోనా కారణంగా వాయిదా వాయిదా వేసిన మార్చి ఏప్రిల్ నెల సగం జీతాలను ఐదు విడతల్లో చెల్లిస్తారు. మొదటి విడత ఈ నవంబర్ నెల జీతంతో నగదుగా చెల్లిస్తారు.